(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని గ్రామాలు బోర్డర్ని తలపిస్తున్నాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.రాజధాని రైతుల పాదయాత్ర నేపథ్యంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో కవాతు నిర్వహించడంపై లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
పాకిస్తాన్ బోర్డర్లో కూడా ఇంత మంది పోలీసులు ఉండరు అని అన్నారు. అన్యాయంగా, క్రూరంగా పోలీసు బలంతో ఉద్యమాన్ని అణచివేయాలని సిఎం జగన్ యుద్ధ వాతావరణం తీసుకొస్తున్నారని విమర్శించారు.
వైసిపి ప్రభుత్వం ఎంత అణచివేస్తే ఉద్యమం అంత ఉగ్రరూపం దాలుస్తుందని ఆయన పేర్కొన్నారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులను రెచ్చగొట్టే చర్యలు వైసిపి ప్రభుత్వం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
వైకాపా ప్రభుత్వం ఎంత అణిచివేస్తే ఉద్యమం అంత ఉగ్రరూపం దాలుస్తుంది. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులను రెచ్చగొట్టే చర్యలు వైకాపా ప్రభుత్వం మానుకోవాలి.(2/2)
— Lokesh Nara (@naralokesh) January 10, 2020