విజయవాడ: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలపై వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు తీవ్రంగా మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజధాని ప్రాంతానికి వెళ్లి మాట్లాడితే, అప్పుడు అక్కడి ప్రజలు చేసే సన్మానాన్ని తాను చూడాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.
“రాజధాని రైతుల మీద తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మీ రూమ్స్ లో కాకుండా ఒక్కసారి రాజధాని ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తే, వాళ్ళు మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉంది” అని ట్విట్టర్ లో నాగబాబు పేర్కొన్నారు.
“రాజధాని రైతుల పోరాటం నిజంగా ప్రశంసనీయం.ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికి రైతుల పోరాటం స్ఫూర్తి దాయకం. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. మీ పోరాటం వృధా పోకూడదని కోరుతున్నా”అని మరో ట్వీట్ చేశారు.
రాజధాని రైతుల మీద తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్ యల్ యేలు మీ రూమ్స్ లో కాకుండా ఒక్కసారి రాజధాని ప్రాంతం లో ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళు మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉంది.
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 10, 2020
రాజధాని రైతుల పోరాటం నిజంగా ప్రశంసనీయం.ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికి రైతుల పోరాటం స్ఫూర్తి దాయకం.మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.మీ పోరాటం వృధా పోకూడదని కోరుతున్నా.
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 10, 2020
అమరావతిలో ఆందోళన చేస్తున్నవారిలో టీడీపీ మనుషులు, పెయిడ్ ఆర్టిస్టులే ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యేలు అబంటి రాంబాబు, ధర్మాన ప్రసాద్ రావుతోపాటు పలువురు నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. అమరావతి ఆందోళనలన్నీ బోగస్ అని, అవన్నీ టీడీపీ డైరెక్షన్లో జరుగుతోన్న నిరసనలే అని విమర్శించారు. ఈ ఆరోపణలపై రాజధాని రైతులు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.