(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
విజయనగరం: మూడు రాజధానుల ప్రకటన చేసి ఈ ప్రభుత్వం రాష్ట్రానికి ఎటు తీసుకెళ్లాలనుకొంటోందని టిడిపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి అశోక్గజపతిరాజు ప్రశ్నించారు. రాజధానుల ప్రకటనపై ఆయన మండిపడ్డారు. చరిత్రలో మొఘలాయిలు తరువాత మహమ్మద్ బీన్ తుగ్లక్ తరచూ రాజధానులు మార్చేవారనీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తిందనీ అన్నారు.
నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అంగీకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రోజుకో చోట రాజధాని పెడతానని చెబుతున్నారని విమర్శించారు. రాజధాని తరలిస్తే అమరావతి ప్రాంతంలో 33వేల ఎకరాల భూములు త్యాగం చేసిన రైతుల పరిస్థితి ఏమిటని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా చంద్రబాబు హయాంలో రాజధానికి భూసేకరణ చేశారని గుర్తు చేశారు. ఎవరు అడిగితే వారికి రాజధాని ఇచ్చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?