అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గోదావరి నదిలో బోటు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుండి హెలికాఫ్టర్లో సిఎం సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని, రెస్క్యూ ఆపరేషన్ను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమండ్రి ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 12కు చేరింది. తాజాగా సోమవారం వెలికి తీసిన మృతదేహాల్లో నెలల వయస్సు చిన్నారి ఉండటం చూపరుల హృదయాలను కలచివేసింది. గల్లంతైన మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక బోట్లతో ఎన్డిఆర్ఎఫ్ బృందంతో పాటు నావీ బృందం కూడా విస్తృతంగా గాలిస్తోంది. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు.