NewsOrbit
టాప్ స్టోరీస్

‘రాజీనామాలు సవ్యంగా లేవు’!

బెంగళూరు: తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ స్పందించారు. మొత్తం 13 రాజీనామా పత్రాలలో ఎనిమిది రాజీనామా పత్రాలు చట్టబద్ధంగా లేవని చెప్పారు. సరైన పద్ధతిలో రాజీనామాలు సమర్పించాల్సిందిగా వారిని కోరినట్లు తెలిపారు. మిగిలిన వారిలో ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ, నారాయణ గౌడలను 12వ తేదీ వచ్చి తనను కలవాల్సిందిగా కోరానని ఆయన చెప్పారు.

ఇంతవరకూ ఒక్క తిరుగుబాటు శాసనసభ్యుడు కూడా వచ్చి తనను కలిసింది లేదని ఆయన పేర్కొన్నారు. ఒక అనర్హత పిటిషన్ తన దగ్గర పెండింగ్‌లో ఉందని  స్పీకర్ చెప్పారు. రాజీనామాలపై గవర్నర్‌కు లేఖ రాశానని ఆయన చెప్పారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందిగా ఆయన సూచించారనీ, ఆ ప్రకారమే వ్యవహరిస్తాననీ రమేష్ కుమార్ అన్నారు.

అంతకు ముందు:

స్పీకర్ చేతిలో సంకీర్ణం భవిత!

కర్నాటక లోని కాంగ్రెస్ – జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ ప్రభుత్వం మనుగడ మంగళవారం మరింత ప్రశ్నార్ధకంగా మారింది. మరో కాంగ్రెస్ శాసనసభ్యుడు రోషన్ బేగ్  ఈరోజు రాజీనామా చేశారు. ఈరోజు జరిగిన కీలకమైన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి 12 మంది సభ్యులు హాజరు కాకపోవడంతో అస్థిరత్వం ఇంకా ఎక్కువయింది.  మరో ముగ్గురు సభ్యులు అనారోగ్యం కారణాలతో సమావేశానికి రాలేదు. కర్నాటక సంక్షోబాన్ని పరిష్కరించేందుకు సోనియా గాంధీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ను బెంగళూరు పంపారు.

ఇక రాష్ట్రప్రభుత్వ మనుగడ తాత్కాలికంగా అసెంబ్లీ స్పీకర్ చేతిలోకి వెళ్లింది. 13 మంది రాజీనామాలపై స్పీకర్ కెఆర్ రమేష్ కుమార్ తక్షణమే నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలిసిపోయింది. రాజీనామాలపై నిర్ణయానికి నిర్దిష్ట కాలపరిమితి లేదని మంగళవారం తన కార్యాలయానికి వచ్చిన స్పీకర్ పేర్కొన్నారు. పోస్టులో వచ్చిన రాజీనామాలను ఆమోదించేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇంతవరకూ ఎవరూ తనను కలిసేందుకు రాలేదని ఆయన అన్నారు. దీనితో సభ్యుల రాజీనామాలపై స్పీకర్ తీసుకోబోయే వైఖరి సూచనప్రాయంగా వెల్లడయింది. తాను రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.

రాజీనామాలు చేసిన కాంగ్రెస్, జెడిఎస్ శాసనసభ్యులు ముంబైలో తాము బస చేసిన హోటల్  నుంచి గుర్తు తెలియని చోటికి మకాం మార్చారు. వారు బస చేసిన హోటల్ బయట యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రదర్శనకు దిగడంతో అసమ్మతి శాసనసభ్యులు రహస్యంగా మకాం మార్చారు. మరెవరూ ఫిరాయింపులకు పాల్పడకుండా నివారించడం కోసం జెడిఎస్ నాయకత్వం మిగతా వారిని బెంగళూరు శివారలలోని ఒక రిసార్టుకు తరలించింది.

ప్రభుత్వ పతనాన్ని నివారించే వ్యూహంలో భాగంగా మంత్రులందరూ రాజీనామా చేశారు. అయితే అసమ్మతి శానససభ్యులు ఎందరు అందుబాటులోకి వచ్చేదీ, అసలు వచ్చేదీ లేనిదీ తెలియదు. దీనికంతటికీ బిజెపి కారణమని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డికె శివకుమార్ ఆరోపించారు. అసమ్మతి సభ్యుడు హెచ్ నగేష్ ఛార్టర్డ్ విమానంలో ముంబై వెళ్లేముందు బెంగళూరు వమానాశ్రయంలో యడ్యూరప్ప అనుచరుడితో కలిసి కనబడ్డారు. యడ్యూరప్ప మనిషి తనను బలవంతంగా ముంబై తీసుకువెళుతున్నట్లు నగేష్ తనకు పోన్ చేసి చెప్పాడనీ, తాను చేరుకునేసరికి విమానం వెళ్లిపోయిందనీ శివకుమార్ పేర్కొన్నారు.

 

author avatar
Siva Prasad

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment