ఇండోర్: మధ్యప్రదేశ్ లో మైనర్ బాలికపై అత్యాచారినికి పాల్పడిన నిందితుడిపై న్యాయవాదులు దాడికి యత్నించారు. అత్యాచారం కేసులో విచారణలో భాగంగా ఆ నిందితుడిని శనివారం పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. నిందితుడిని చూసిన న్యాయవాదులు ఆగ్రహానికి గురై పిడిగుద్దులు కురిపించబోయారు. అయితే, ఆ నిందితుడిని పోలీసులు రక్షించి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Indore: Lawyers present at court premises attempted to thrash an accused in a minor girl rape case. The accused was brought to the court for a hearing in the case. #MadhyaPradesh pic.twitter.com/VyVyZerlkb
— ANI (@ANI) December 7, 2019
హైదరాబాద్ లో దిశ ఘటన అనంతరం అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతున్న మృగాళ్లపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దిశ ఘటనలోనూ నిందితులను తమకు అప్పగించాలని వారి అంతం చూస్తామని ప్రజా సంఘాలు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది.