ఇస్లామాబాద్ మార్చి 3 : బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా తొలగించాలని పాకిస్తనీయులు డిమాండ్ చేస్తున్నారు. పాక్పై భారత మెరుపు దాడులను ప్రియాంక సమర్ధించటమే ఇందుకు కారణం.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాద శిభిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. ఈ మెరుపు దాడిని కొనియాడుతూ ‘జై హింద్’ అని ప్రియాంక చోప్రా ట్వీట్ చేసింది.
ప్రియాంక ట్వీట్పై పాక్ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేశారు.
‘ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రజల సర్వనాశానానికి దారితీస్తుంది. యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా ప్రియాంక ఈ అంశంలో తటస్థంగా ఉండాలి. కానీ, ఆమె ట్వీట్ ఒక దేశానికి మద్దతుగా ఉంది. కాబట్టి ఆమె యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా అనర్హురాలు’ అని పిటిషన్లో పేర్కొన్నారు.
పిటిషన్పై దాదాపు వెయ్యి మందికిపైగా నెటిజన్లు సంతకాలు చేశారు. ఈ పిటిషన్పై ప్రియాంక నుంచి ఎలాంటి స్పందన రాలేదు.