(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
డాక్టర్ దిశను హత్యాచారం చేసిన నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దిశ నిందితులను ఎన్కౌంటర్ చేశారని తెలియడంతో చుట్టుపక్కల వారు పెద్దఎత్తున ఘటనాస్థలికి వచ్చారు. దిశ ఆత్మకు శాంతి చేకూరిందని, ఆమె కుటుంబానికి న్యాయం జరిగిందని నినాదాలు చేశారు. తెలంగాణ పోలీసులకు జైకొట్టారు. వందలాది మంది ఆ ప్రాంతంలో చేరి “పోలీసులూ జై”, “జస్టిస్ ఫర్ దిశ”, “సజ్జనార్ జిందాబాద్” అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
జాతీయ రహదారి పక్కనే ఈ ఎన్ కౌంటర్ జరగడంతో.. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు, తమ వాహనాలను సైతం బ్రిడ్జి వద్ద ఆపి ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను ఇప్పటికే తరలించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఈ ఎన్ కౌంటర్ పై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడే వారికి ఇటువంటి శిక్షలే పడాలని, అప్పుడే మరొకరు ఇటువంటి దారుణాలకు పాల్పడాలన్న ఆలోచన కూడా చేయబోరని పేర్కొంటున్నారు.
#WATCH Hyderabad: People celebrate and cheer for police at the encounter site where the four accused were killed in an encounter earlier today. #Telangana pic.twitter.com/WZjPi0Y3nw
— ANI (@ANI) December 6, 2019
#WATCH Hyderabad: Neigbours of the woman veterinarian, celebrate and offer sweets to Police personnel after the four accused were killed in an encounter earlier today pic.twitter.com/MPuEtAJ1Jn
— ANI (@ANI) December 6, 2019
Hyderabad: Neigbours of the woman veterinarian, tie rakhi to Police personnel after the four accused were killed in an encounter earlier today pic.twitter.com/ltNsBLOPO6
— ANI (@ANI) December 6, 2019