(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యకేసులో నిందితులు ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో సీపీ సజ్జనార్ పేరు మార్మోగుతోంది. 2008 వరంగల్లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్కౌంటర్ ఘటనను చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో.. అప్పుడు వరంగల్ జిల్లా ఎస్పీగా సజ్జనార్గా ఉన్నారు. రెండు ఘటనల్లో కేసుల్ని సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ డీల్ చేశారు. తాజా ఎన్కౌంటర్తో 2008 సీన్ మళ్లీ రిపీట్ అయ్యిందని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు.
https://twitter.com/DotsByHari/status/1202780813575606273
సరిగ్గా పదేళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో 2008 డిసెంబర్ 10న వరంగల్ లోని కిట్స్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న స్వప్నిక తన స్నేహితురాలు ప్రణీతతో కలిసి స్కూటీపై కాలేజీకి వెళుతోంది. అదే సమయంలో మార్గ మధ్యలో మాటు వేసిన శ్రీనివాస్ అనే యువకుడు స్వప్నికపై యాసిడ్తో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్వప్నికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉండటంతో.. సికింద్రబాద్లోని యశోదా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్సపొందుతూ ఆమె చనిపోయింది. స్కూటీ వెనుక కూర్చొన్న ప్రణీత తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడితో పాటూ అతడికి సహకరించిన స్నేహితుల్ని అరెస్ట్ చేశారు. ఇప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్.. అప్పుడు వరంగల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్ని ఘటన జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లిన సమయంలో.. పారిపోయేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు చనిపోయారు.
Remembering the encounter of #WarangalAcid case accused…the Super Cop, the Encounter Specialist IPS VC #Sajjanar (from Hubballi, Karnataka) 2008 & 2019:The Superintendent of Police VC Sajjanar, led the team of policemen who killed three persons accused of throwing acid at two pic.twitter.com/9eINjDqKnR
— Antevasin?? (@Antevasin10) December 6, 2019
ఈ యాసిడ్ అటాక్లో ముగ్గురు నిందితులైన శాఖమూరి శ్రీనివాస్, బజ్జురి సంజయ్, పోతరాజు హరికృష్ణలను కస్టడీలోకి తీసుకున్న మూడు రోజుల అనంతరం వరంగల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు. వాళ్ళు కూడా సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేస్తుండగా.. తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు కాల్చి చంపారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత డాక్టర్ దిశ హత్యకేసు నిందితులను సైతం ఎన్కౌంటర్లో హతమార్చారు. శుక్రవారం(డిసెంబర్ 6) వేకువజామున శంషాబాద్ సమీపంలో చటాన్ పల్లి దగ్గర నలుగురు నిందితుల్ని కాల్చి చంపారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. నిందితులు రాళ్లు రువ్వడంతో పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం.
వరంగల్, శంషాబాద్ కేసుల్లో ఐపీఎస్ అధికారి సజ్జనార్ కీలక బాధ్యతల్లో ఉన్నారు. సరిగ్గా పదేళ్ల తరువాత అలాంటి ఘటనే రిపీట్ కావడం, అదీ కూడా రెండూ జరిగినవి డిసెంబర్లోనే కావడం గమనార్హం. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిందితులకు సరైన శిక్ష పడిందంటూ ట్వీట్లు, పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. సీపీ సజ్జనార్ పేరు సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. రెండు ఘటనల్లోనూ సజ్జనార్ కీలక బాధ్యతల్లో ఉన్నారని.. అప్పుడు వరంగల్ ఎస్పీగా.. ఇప్పుడు సైబరాబాద్ సీపీగా ఆయనే ఉన్నారని గుర్తు చేస్తున్నారు.
A group of men gathered near the site where the four accused were shot dead cheer Telangana police for the killings. pic.twitter.com/kuY6pgyHIk
— Jahnavi Reddy (@Jahnavi_R) December 6, 2019
Neighbours outside Disha's house distribute sweets. They say justice is served.@thenewsminute pic.twitter.com/QPe1crpGcJ
— Priyanka Richi (@priya_richi) December 6, 2019