న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ పై ఆదివారం ఉదయం విచారణ జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది.
21.00: గంటలకు ముందు…
మహారాష్ట్ర లో ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటు ను సవాల్ చేస్తూ శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశాయి. ఫడ్నవీస్ ను గవర్నర్ ఆహ్వానించడంపై మూడు పార్టీలు అభ్యంతరం తెలిపాయి. రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు తొలగించారు, ఫడ్నవీస్ ను ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ ఆహ్వానించారు తదితర అనుమానాలను వ్వక్తం చేశారు. తమకు 144 మందికి పైగా మద్దతు ఉందని పిటిషన్ లో పేర్కొన్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కు తమను ఆహ్వానించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరాయి.
శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నేటి ఉదయం అనూహ్యాంగా ఫడ్నవీస్ సిఎం గా, ఎన్ సి పి నేత అజిత్ పవార్ డిప్యూటీ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.