హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసులో ఎన్కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రికి తరలించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుపై దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు గురువారానికి (డిసెంబర్ 12) వాయిదా వేసింది. నిందితుల మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రికి తరలించాలని తెలిపింది. సుప్రీంకోర్టులో దాఖలైన పపిటిషన్ పై విచారణ ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. సీనియర్ లాయర్ ప్రకాష్రెడ్డిని మధ్యవర్తిగా సూచనలు ఇవ్వాలని సూచించింది. ప్రస్తుతం నలుగురు నిందితుల మృతదేహాలు మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో ఉన్నాయి. శుక్రవారం(డిసెంబర్ 13) వరకు గాంధీ ఆస్పత్రిలోనే నిందితుల మృతదేహాల్ని భద్రపరచాలని కోర్టు ఆదేశించింది.
దీంతో నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు మరోసారి బ్రేక్ పడినట్టు అయ్యింది. డిసెంబర్ 6వ తేదీ ఉదయం నలుగురు నిందితుల ఎన్కౌంటర్ జరగగా… అదే రోజు సాయంత్రానికి అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు భావించారు. అయితే, ఎన్హెచ్ఆర్సీ నోటీసులు, హైకోర్టు ఆదేశాలతో అంత్యక్రియలు నిలిచిపోయి. దీంతో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన ప్రాంతంలో ఆ తర్వాత మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలో మృతదేమాలను భద్రపరిచారు. హైకోర్టు విచారణ తర్వాత ఇవాళ మృతదేహాలను బంధువులకు ఇస్తారని అంతా భావిస్తున్న తరుణంలో.. హైకోర్టు మరోసారి ఈ కేసు వాయిదా వేసింది. దీంతో మరోసారి అంత్యక్రియలకు బ్రేక్లు పడగా.. మహబూబ్నగర్ నుంచి గాంధీకి నిందితుల మృతదేహాలను తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.