లక్నో: తన కూతురు మరణానికి కారణమైన వారిని పోలీసులు కాల్చి చంపేయాలని ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి అన్నారు. హైదరాబాద్ లోని దిశకు జరిగినట్లే తమకు న్యాయం కావాలని కోరారు. 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలు ఢిల్లీలో సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం( డిసెంబర్ 6) రాత్రి చనిపోయింది. ఈ సందర్భంగా ఆమె తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నా కూతురు మరణానికి కారణమైన ఐదుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపాలి లేదా ఉరి తీయండి. మమ్మల్ని వారు రోజూ వేధిస్తూనే ఉన్నారు. ధనబలంతో మాకు న్యాయం జరగకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు ‘ అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ఉన్నావ్ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఉన్నావ్ రేప్ కేసులో బాధితురాలు మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath has expressed grief over death of Unnao rape victim. CM has said all accused have been arrested and the case will be taken to fast-track court (file pic) pic.twitter.com/1rJsodMsVL
— ANI UP (@ANINewsUP) December 7, 2019
ఉన్నావ్ కేసులో ఐదుగురు నిందితులను జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. వీరికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. భద్రత నడుమ నిందితులను తరలించారు. ఉన్నావ్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి సోదరుడు డిమాండ్ చేశాడు.
డిసెంబర్ 5వ తేదీ ఉన్నావ్ బాధితులరాలు కోర్టు విచారణ కోసం రాయ్ బరేలీ వెళ్లేందుకు బయలుదేరగా.. ఐదుగురు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. కిరోసిన్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలతో కొనఊపిరితో ఉన్న యువతిని మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీ, సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం(డిసెంబర్ 6) రాత్రి కన్నుమూసింది.
తెలంగాణలో దిశ నిందితుల ఎన్ కౌంటర్పై పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఉన్నావ్ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఐదుగురు నిందితులకు ఎలాంటి శిక్ష పడుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
The 5 accused in Unnao rape case being taken to jail from court yesterday night, after being remanded to 14 day judicial custody. The victim passed away during treatment in Delhi yesterday, following cardiac arrest. pic.twitter.com/85KhUHJc9U
— ANI UP (@ANINewsUP) December 7, 2019