NewsOrbit
టాప్ స్టోరీస్

‘అయిన వాళ్లకు దోచిపెట్టారు’

అమరావతి: సబ్ కాంట్రాక్టుల ముసుగులో టిడిపి ప్రభుత్వం తమకు నచ్చిన వారిని తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్టులో నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారనీ, అక్కడ పెద్ద ఎత్తున స్కామ్‌లు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోపించారు. పది పదిహేను రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చినపుడు బండారం బయటపడుతుందని జగన్ పేర్కొన్నారు.

శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నపై చర్చ సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. జలవనరుల శాఖ మంత్రి మంత్రి అనిల్ కుమార్ చెప్పిన సమాధానంపై సంతృప్తి చెందని టిడిపి సభ్యులు పోలవరం ప్రాజెక్టుపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు.

ప్రశ్నోత్తరాల సమయంలో డిబేట్ సాధ్యపడదని, వేరే ఫామ్‌లోవస్తే చర్చకు అవకాశం ఇస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొని ప్రశ్నోత్తరాలను కొనసాగిస్తుండగా టిడిపి సభ్యులు నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికార పక్షం పేర్కొంది.

ఈ సందర్భంలో సిఎం జగన్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించిందనీ, దీనిపై తాము నిపుణుల కమిటీని నియమించామని చెప్పారు. తనకు అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం రివర్స్ టెండరింగ్ విధానానికి వెళితే కనీసం 15నుండి 20 శాతం అంటే సుమారు 15వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి కూడా పోలవరంలో సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని జగన్ ఆరోపించారు.పెంచిన రేట్లతో ఆయన పనులు చేస్తున్నాడని జగన్ పేర్కొన్నారు. స్పిల్ వే పనులు పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ పనులు చేపట్టారని జగన్ అన్నారు. కాఫర్ డ్యామ్ వల్ల గోదావరి వెడల్పు 70శాతం తగ్గిపోయిందని జగన్ చెప్పారు.

‘జెన్‌కో సంబంధించిందిన పనులు తమకు కావాల్సిన నవయుగ కంపెనీకి ఇచ్చారు, ఇంత వరకూ డిజైన్‌లు ఫైనలైజ్ కాలేదు. వారు పనులు ప్రారంభించలేదు, ఒక్కఇటుక పని కూడా చేయలేదు కానీ 724కోట్ల రూపాయలు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు’ అని జగన్ ఆరోపించారు. ఏ స్థాయిలో పోలవరం ప్రాజెక్టను వీరు దోచేశారో పది పదిహేను రోజుల్లో బయటకు వస్తుందని జగన్ అన్నారు. నిపుణుల కమిటి నుండి త్వరలో నివేదిక వస్తుందని జగన్ పేర్కొన్నారు.

ఎట్టిపరిస్థితుల్లో నవంబర్ ఒకటి నుండి పనులు మొదలు పెట్టాలనీ సూచించామనీ, 2021 జూన్ నాటికి నీళ్లు ఇవ్వాలన్నది తమ లక్ష్యమని జగన్ పేర్కొన్నారు. మూడు రోజులుగా మంత్రి వివరణ ఇస్తున్నా చంద్రబాబు దుర్బుద్ధితో రాద్ధాంతం చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment