హైదరాబాద్ః టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ను మళ్లీ ప్రభుత్వంలో చూసేందుకు ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. హైదరాబాద్కు గత ఏడాది ఒప్పో, ఇటీవల అమెజాన్, తాజాగా వన్ప్లస్ వచ్చిందని ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. దిగ్గజ కంపెనీల రాకతో హైదరాబాద్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఆ ట్వీట్కు స్పందించిన అసదుద్దీన్..ఆ ఘనతంతా మాజీ మంత్రి కేటీఆర్దేనని అన్నారు. ఆయన మళ్లీ ప్రభుత్వంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ఓవైసీ తెలిపారు.
గత ప్రభుత్వంలో ఐటీ, మున్సిపల్, గనుల శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేశారు. ముఖ్యంగా ఐటీశాఖ మంత్రిగా పాలనలో తనదైన ముద్రవేశారు. గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. కేసీఆర్ కేబినెట్లో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ పరమైన కార్యక్రమాలకు మాత్రమే కేటీఆర్ పరిమితమయ్యారు. మంత్రి పదవిలో లేనందున పాలన వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో కేటీఆర్పై అసుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Credit must be given to “ex minister”@KTRTRS ,waiting to see him back in governance https://t.co/ukbi46UIXj
— Asaduddin Owaisi (@asadowaisi) August 26, 2019