NewsOrbit
రాజ‌కీయాలు

ఆర్థిక ఇబ్బందులుంటే మూడు రాజధానులెందుకు?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేగుతున్న మూడు రాజధానుల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల వల్ల ఏ ప్రయోజనమూ లేదని అన్నారు. రాజధాని వికేంద్రీకరణ వల్ల నష్టమే తప్ప లాభం ఉందని తెలిపారు. ప్రజా ధనం భారీగా వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక భారమైన అన్ని రాజధానుల నిర్మాణానికి ఎందుకు పూనుకుంటున్నారని ప్రశ్నించారు.

తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు తమ ఉనికిని చాటుకోవడం కోసమే, రాజధానులు, కొత్త నిర్మాణాల అంశాన్ని లేవనెత్తుతున్నారని వీహెచ్ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న కేంద్రం.. రాజధాని విషయంలోనూ జగన్‌ను నియంత్రించాలని కోరారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం నిలిపివేయాలని, బ్యాంకు రుణాలు రాకుండా అడ్డుకోవాలని సూచించారు.

ఇదిఇలా ఉంటే.. ఏపీకి మూడు రాజధానుల అంశంపై ఇటీవల ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనకు మద్దతు పలికిన ఆయన తెలంగాణలోనూ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌లో అసెంబ్లీ ఏర్పాటు చేయాలని, ఏడాదికి రెండు సార్లు శాసనసభ సమావేశాలు ఆదిలాబాద్‌లో నిర్వహించాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Related posts

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Leave a Comment