అమరావతి: రాష్ట్రంలో ఏకపక్ష మరీ చెప్పాలంటే ఏకవ్యక్తి పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ఆయన స్పందన తెలియజేశారు. జగన్ ఆరు నెలల పాలన ప్రజలకు మిశ్రమ ఫలితాలను ఇచ్చిందని అన్నారు. కొందరికి మోదంగా, మరికొందరికి ఖేదంగా గడిచిందని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను ఖాతరు చేయడంలేదని విమర్శించారు. మంత్రులకు స్వేచ్చగా నిర్ణయాలు తీసుకునే అధికారంలేదనీ అంతా జగన్ మయమేననీ అన్నారు. నవరత్నాల హామీల అమలు పూర్తిగా నోచుకోకపోయినా కొంత మేరకు కృషి జరిగిందని అన్నారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించారని రామకృష్ణ కితాబు ఇచ్చారు.
గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అంటూ కొత్త ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో అభద్రతాభావం నెలకొన్నదని అన్నారు. ఇప్పటికే కొంత మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొన్నారు.
ఇసుక పాలసీ అంటూ అయిదు నెలల పాటు ఇసుక సరఫరా ఆపివేయడంతో 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా కాంటీన్ల మూసివేతతో నిరుపేదలు, దినసరి కూలీలు ఇబ్బందుకు పడుతున్నారని ఆయన అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?