అమరావతి: ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యంపై బదిలీ వేటు పడింది. ఆయనను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (హెచ్ఆర్డి డైరెక్టర్ జనరల్) డీజిగా ప్రభుత్వం బదిలీ చేసింది. సిఎస్ ఆకస్మిక బదిలీ అధికార యంత్రాంగాన్ని నివ్వెరపాటుకు గురి చేసింది.
బిజినెస్ రూల్స్ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, జిఎడి పొలికల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్కు సిఎస్ ఎల్వి సుబ్రమణ్యం మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాష్కు ఎల్వీ షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనికి 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. కేబినెట్ అజెండాలో పెట్టే అంశాలను సిఎస్ ఆమోదం లేకుండా నేరుగా అజెండాలో చేర్చడం ఏపి బిజినెస్ రూల్స్కు వ్యతిరేకమనీ, విధి విధానాలు పాటించలేదనీ, సిఎస్ ఆమోదం లేకుండా ఎలా చేస్తారని ఎల్వి ప్రశ్నిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేశారు.
బిజినెస్ రూల్స్ మార్పు ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యమంత్రి జగన్ ఆమోదంతోనే జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్కు తెలియకుండా ఎల్వి సుబ్రమణ్యం ప్రవీణ్ ప్రకాష్కు షోకాజ్ నోటీసు ఇవ్వడంపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎల్వీపై బదిలీ వేటు పడింది.
ఇన్చార్జి సిఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ కొనసాగేలా ఆదేశాలు జారీ చేశారు.