హైదరాబాద్: అక్రమాస్తుల కేసు విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలంటూ ఏపి సిఎం జగన్ చేసిన అభ్యర్థనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అభ్యంతరం తెలిపింది. జగన్ అభ్యర్థనపై ఈడి కోర్టులో శుక్రవారం వాదనలు పూర్తి అయ్యాయి. సిఎంగా ప్రజా విధుల్లో ఉన్నందున హాజరు మినహాయింపు ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాది కోరారు. దీనిపై తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితులకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వోద్దని ఈడి వాదించింది. అనంతరం తీర్పును న్యాయస్థానం ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.