ఏపీలో కార్పొ”రేట్” ఇంటర్ కళాశాలకు ఇక బ్రేకులు పడనున్నాయి. ఫీజులు, సౌకర్యాలు, అదనపు తరగతులు పేరిట లక్షలు దోచేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ తరహా కళాశాలక ఇక చెక్ పడనుంది. వీటిపై జగన్ మార్కు లో మార్పులు రానున్నాయి. పూర్తిస్థాయిలో ఫీజులను నియంత్రించి, కళాశాలల అడ్మిషన్లు, సౌకర్యాలు అన్నిటినీ ప్రభుత్వం ఇక తమ గుప్పిట్లో పెట్టుకోనుంది. అందుకు కఠిన చట్టం రూపొందించేలా ముఖ్యమంత్రి జగన్ యోచిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుండే దీన్ని అమలు చేసేలా కసరత్తులు చేస్తున్నారు.
రకరకాల పేర్లు… ఎత్తులు…!
శ్రీ చైతన్య, నారాయణ కళాశాలపై ప్రస్తుతం ఆదాయపన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. వీటి లావాదేవీలు తెలనున్నాయి. అయితే కార్పొరేట్ యజమాన్యాల్లో ఉన్న ఈ కళాశాలకు ఆ దాడుల నుండి ఎలా తప్పించుకోవాలో తెలుసు. లెక్కలకు దొరక్కుండా మాయలు చేయడంలో ఆరితేరారు. పక్కాగా రికార్డుల నిర్వహమా ఉంటున్నట్టు చూపిస్తూనే అదనపు వడ్డింపులు ఉంటాయి. ఉదహరణకు ఒక విద్యార్థి నుండి రూ. లక్ష ఫీజు తీసుకుంటే అతని పేరిట రూ. 50 వేలు మాత్రమే ఉంటుంది. అలాగే ఒక సిబ్బందికి రూ. 50 వేలు జీతం చెల్లిస్తే కేవలం 20 వేలు చూపిస్తారు. ఇలా నారాయణలో చాలా మంది కీలక స్థానాల్లో ఉన్నవారికి రూ. లక్షల్లో వేతనాలు ఉన్నప్పటికీ వేలల్లోనే చూపిస్తారు.
శ్రీ చైతన్య, నారాయణ కళాశాలపై ప్రస్తుతం ఆదాయపన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. వీటి లావాదేవీలు తెలనున్నాయి. అయితే కార్పొరేట్ యజమాన్యాల్లో ఉన్న ఈ కళాశాలకు ఆ దాడుల నుండి ఎలా తప్పించుకోవాలో తెలుసు. లెక్కలకు దొరక్కుండా మాయలు చేయడంలో ఆరితేరారు. పక్కాగా రికార్డుల నిర్వహమా ఉంటున్నట్టు చూపిస్తూనే అదనపు వడ్డింపులు ఉంటాయి. ఉదహరణకు ఒక విద్యార్థి నుండి రూ. లక్ష ఫీజు తీసుకుంటే అతని పేరిట రూ. 50 వేలు మాత్రమే ఉంటుంది. అలాగే ఒక సిబ్బందికి రూ. 50 వేలు జీతం చెల్లిస్తే కేవలం 20 వేలు చూపిస్తారు. ఇలా నారాయణలో చాలా మంది కీలక స్థానాల్లో ఉన్నవారికి రూ. లక్షల్లో వేతనాలు ఉన్నప్పటికీ వేలల్లోనే చూపిస్తారు. ఇలా లావాదేవీలను తగ్గించి చూపి, ఆదాయపన్ను నుండి తప్పించుకుంటారు. అందుకే ఇక ప్రభుత్వం నుండి తప్పించుకోకుండా ఉండేందుకు జగన్ పక్కాగా స్కెచ్ ఆలోచిస్తున్నారు. తొలి నుండి నారాయణ, శ్రీ చైతన్య కళాశాలల తీరుపై ఆగ్రహంతో ఉన్న సీఎం జగన్ వాటికి చెక్ పెట్టేలా చట్టం సిద్ధం చేయిస్తున్నారు.
- ఇక ఇంజినీరింగ్ కళాశాలల ఫీజులు ఎలా అయితే ప్రభుత్వం నిర్ణయిస్తుందో.., ఇక మీదట జూనియర్ కళాశాలల ఫీజులు కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.
- అడ్మిషన్లు ప్రక్రియ మొత్తం ఆన్లైన్ చేయనున్నారు. కళాశాలలో చేరే ప్రతి విద్యార్థి డేటా ప్రభ్యత్వం వద్ద ఉంటుంది.
- ఐకాన్ అని, ఐకాన్ టాపర్ బ్యాచ్ అంటూ రకరకాల పేర్లు పెట్టి ఫీజులు అదనంగా గుంజే వ్యవస్థపై ప్రభుత్వం ఇక కఠినంగా వ్యవహరించనుంది.
- ప్రభుత్వ పరిధిలో, నిర్దేశించిన ప్రమాణాలు.., ఫీజులు పాటించకుంటే గుర్తింపు రద్దు చేయనున్నారు. ఇది ఈ జూన్ నుండే అమలయ్యేలా సిద్ధం చేస్తున్నారని సమాచారం.
- రాష్ట్రంలో 125 వరకు నారాయణ కళాశాలలు, 140 వరకు శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ఏటా దాదాపు 60 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుని…, సగటున లక్ష ఫీజు చెల్లిస్తున్నారు. ఇవన్నీ ఇకపై ప్రభుత్వ నియంత్రణలోకి రానున్నాయి.