అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకొన్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ (ఎంఈఇఎల్) గురువారం పనులను పునః ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అంతర్బాగమైన కాంక్రీట్ పనులు ప్రారంభించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ప్రాజెక్టు పనులు మేఘా సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీన మేఘా ఇంజనీరింగ్ సంస్థ సైట్ స్వాధీనం చేసుకొని భూమి పూజ నిర్వహించి పనులను లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు పదిహేను రోజుల పాటు పనులు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆదేశించింది. దీంతో హైకోర్టు ఆదేశాలతో ఇప్పటి వరకూ పనులు నిలుపుదల చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ గురువారం పనులను పునః ప్రారంభించింది.
తొలి రోజు 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను చేశారు. ప్రతి రోజు రెండు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేపట్టాలని మేఘా సంస్థ నిర్ణయించింది. రాక్ ఫిల్ డ్యామ్లో 1.50 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయనున్నారు.
ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్, కాఫర్ డ్యామ్ పనులను మేఘా ఇంజనీంగ్ సంస్థ చేయనున్నది. 2020 జూన్ నాటికి స్పిల్వే పనులను, 2021 జూన్ నాటికి రాక్ ఫిల్ డ్యామ్లో లక్షా 50కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేస్తామని మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రకటించింది.