(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీలో ప్రతి రోజు మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అన్నారు. దిశ బిల్లు ఆమోదం పొందిన రోజే పలు చోట్ల అత్యాచార ఘటనలో జరిగాయని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలంలో మతి స్థిమితంలేని యువతిపై మద్యం మత్తులో ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన తనను తీవ్రంగా బాధించిందని నారా లోకేశ్ తెలిపారు. ‘దిశ చట్టం’ ప్రకారం నిందితులకు 21 రోజుల్లో శిక్ష పడేలా చూడాలని కోరారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.
‘జీవం పొసే ‘ఆమె’కు జీవించే హక్కుని హరిస్తున్నారు మృగాళ్లు. ప్రతి రోజు మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దిశ బిల్లు ఆమోదం పొందిన రోజు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో యువతి పై కామంతో మదమెక్కిన ఓ ఉన్మాది అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. దిశ చట్టం పై ప్రజల్లో అవగాహన పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొత్త చట్టం ప్రకారం త్రిపురాంతకం ఘటన నిందితుడికి 21 రోజుల్లోనే శిక్ష పడేలా చూసి బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఈ ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. దిశ చట్టం పై ప్రజల్లో అవగాహన పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొత్త చట్టం ప్రకారం త్రిపురాంతకం ఘటన నిందితుడికి 21 రోజుల్లోనే శిక్ష పడేలా చూసి బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలి.(2/2)
— Lokesh Nara (@naralokesh) December 15, 2019