(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: చలో అసెంబ్లీ ఆందోళన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు రాజధాని ప్రాంత గ్రామాల్లో విస్తృతంగా బందోబస్తు చర్యలు చేపట్టినప్పటికీ వెలగపూడి గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు, మహిళలు పొలాల్లోంచి అసెంబ్లీ సమీపానికి చేరుకున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు. దీంతో వారిని నిలువరించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జాతీయ జండాలు చేబూని పెద్ద ఎత్తున రైతులు, మహిళలు నినాదాలు చేస్తుండటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది
మరో పక్క తుళ్లూరు నుండి అసెంబ్లీ వైపుకు వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అసెంబ్లీ వద్దకు వెళతామనీ, జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే క్రమంలో పలువురు రైతులకు గాయాలయ్యాయి.