విజయవాడ: మూడు రాజధానులు బోగస్ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇందులో జగన్ ల్యాండ్ మాఫియా స్కీమ్ తప్ప సరుకు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
“2014లో రైతుకి రుణ మాఫీ చెయ్యడం దండగ అని అన్నారు. 2019లో రూ.12,500 రైతు భరోసా అని దగా చేసారు. ఇచ్చే రూ.7,500 కూడా మూడు దశల్లో ఇస్తాం అంటున్నారు. అంతే కాదు రైతులు గోచి కట్టుకుని బురదలో నిలబడి నోరుమూసుకుని ఉండాలని…నోరెత్తితే తాట తీస్తాం అని వైసీపీ నాయకులతో వార్నింగ్లు ఇప్పిస్తున్నారు జగన్ గారు. మూడు రాజధానులు బోగస్. జగన్ ల్యాండ్ మాఫియా స్కీమ్ తప్ప మూడు రాజధానుల ప్రతిపాదనలో సరుకు ఎక్కడ ఉంది విజయసాయిరెడ్డి గారు” అంటూ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్లో ప్రశ్నించారు.
అంతే కాదు రైతులు గోచి కట్టుకొని బురదలో నిలబడి నోరుమూసుకుని ఉండాలి నోరెత్తితే తాట తీస్తాం అని వైకాపా నాయకులతో వార్నింగ్లు ఇప్పిస్తున్నారు జగన్ గారు. మూడు రాజధానులు బోగస్. జగన్ గారి ల్యాండ్ మాఫియా స్కీమ్ తప్ప మూడు రాజధానుల ప్రతిపాదనలో సరుకు ఎక్కడ ఉంది @VSReddy_MP గారు?(2/2)
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) January 9, 2020