అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 52వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో మహా ధర్నాలు కొనసాగుతుండగా వెలగపూడిలో 52వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. మందడం, వెలగపూడి, రాయపూడిలో రైతులు 24 గంటల దీక్షలను కొనసాగిస్తున్నారు. ఇద్దరు యువకులు 151 గంటల నిరాహార దీక్షకు దిగారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లోనూ రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అమరావతి లోనే రాజధాని కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు పేర్కొంటున్నారు. నిరాహార దీక్షలు, ధర్నాలు కొనసాగించేందుకు టెంట్ ల స్థానంలో తాటాకులతో పాకలను ఏర్పాటు చేసుకున్నారు. రైతులతో పాటు మహిళలు, యువకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
previous post