అమరావతి: శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయి. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేతపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కీలకమైన మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో ప్రవేశపెడుతున్న తరుణంలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయడం ఏమిటంటూ విపక్షాల సభ్యులు నిలదీస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల ప్రసారాలు నిలిచిపోయాయని సిబ్బంది తెలుపుతున్నారు. కాగా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
previous post
next post