న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో ఓ అరుదైన రికార్డును సాధించారు. నిర్మల బడ్జెట్ ప్రసంగం అత్యధిక సమయం పాటు కొనసాగింది. ఆమె ఏకంగా 2 గంటల 40 నిమిషాల పాటు బడ్జెట్ను చదివి వినిపించి రికార్డు నెలకొల్పారు. తాజా బడ్జెట్ ప్రసంగం నిడివి.. గతంలో ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంతో పోలిస్తే 23 నిమిషాలు ఎక్కువ. 2019 బడ్జెట్ ప్రసంగం నిడివి కూడా 2.17 గంటలు ఉంది. ఇది అప్పటికి రికార్డు సమయం కావడం విశేషం. తాజాగా 2.40 గంటల పాటు ప్రసంగించడంతో నిర్మలా సీతారామన్ తన రికార్డును తానే దాటినట్లయింది.
ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో ప్రసంగం నిడివి కూడా మారుతూ వస్తోంది. తొలి లోక్సభ ఏర్పాటు దగ్గర్నుంచీ ఆర్థిక మంత్రులు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగాలను ఓసారి పరిశీలిస్తే.. శనివారం నాడు నిర్మల బడ్జెట్ ప్రసంగం అత్యధిక సమయం పాటు కొనసాగింది. ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఎవరి ఓపికకు తగ్గట్లుగా వారు ప్రసంగాన్ని రూపొందించుకొని చదువుతుంటారు. ఈ విషయంలో నిర్మల రికార్డు నెలకొల్పారు. నిర్మల తర్వాత కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రెండో స్థానంలో ఉన్నారు. 2014లో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. తన సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చదివేందుకు 2.10 గంటలు పట్టింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. పదాలు, పేరాల విషయంలో అరుణ్ జైట్లీ తర్వాత రికార్డు ప్రణబ్దే కావడం విశేష. దేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రుల్లో రెండోస్థానంలో మాజీ మంత్రి పి.చిదంబరం నిలిచారు. ఆయన ఏకంగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1991 సమయంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆయువు పట్టుగా నిలిచిన ఈ కీలక సమయంలో ఆయన బడ్జెట్ ప్రసంగం నిడివి 18,650 పదాలు. ఆ సమయంలో ఆయన చదివిన బడ్జెట్ ప్రసంగం నిడివే పెద్దది. వాజ్పేయీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసిన జశ్వంత్ సింగ్ 2003లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆయన ప్రసంగం 2 గంటల 13 నిమిషాల పాటు సాగింది. మొత్తం మీద తన ప్రసంగ పాఠాన్ని చదివి విన్పించి పార్లమెంట్లో అత్యధికంగా బడ్జెట్ ప్రసంగం చేసిన మంత్రిగా అరుదైన రికార్డును నెలకొల్పారు నిర్మలా సీతారామన్.
Finance Minister Nirmala Sitharaman: I agree that my budget speech was lengthy but in the speech, I had focussed on and spoken about the schemes for employment for the youth, as well as benefits to them. #Budget2020 https://t.co/T8hSpCzVEH pic.twitter.com/0c18WXSqvo
— ANI (@ANI) February 1, 2020