అమరావతి: రాజధాని మార్చవద్దంటూ విజయవాడలోని గొల్లపూడి వద్ద పెద్ద సంఖ్యలో రైతులు దర్నాకు దిగారు. గొల్లపూడి నుంచి విజయవాడ దుర్గగుడి వరకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించారు.
సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో రైతులకు మద్దతుగా దేవినేని ఉమా రోడ్డుపై భైటాయించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రైతులు, మహిళలు, ప్రజలు వందలాదిగా తరలివచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు దేవినేని ఉమాను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.