అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో వంశీ సమావేశమయ్యారు. మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన జగన్ను కలిశారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన వంశీ.. ఇకపై జగన్ తో కలిసి నడుస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి బయటకు రాగానే ఆపార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్లపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. గత కొద్ది రోజులుగా స్తబ్ధుగా ఉన్న వంశీ.. ఇవాళ సీఎం జగన్ తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరుతారా ? అన్న ప్రచారం జరుగుతోంది.
previous post
next post