నెల్లూరు: నెల్లూరులో సంచలనం సృష్టించిన తల్లీ కుమార్తె హత్యకేసులో ప్రధాన నిందితుడికి ఉరి శిక్ష విధిస్తు ఎనిమిదవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి గురువారం సంచలన తీర్పు వెలువరించారు.
2013లో నెల్లూరులోని హరనాథపురం రెండో వీధిలో ఉండే దినకర్రెడ్డి భార్య శకుంతల, కుమార్తె భార్గవిలను ఇంతియాజ్తో పాటు మరో ఇద్దరు మైనర్ బాలురు పథకం ప్రకారం హత్య చేశారు. నగదు కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
దీనిపై 2013 నుంచి ఇప్పటి వరకు వాదనలు జరిగాయి. ప్రధాన నిందితుడు ఇంతియాజ్ పై నేర నిరూపణ కావడంతో ఉరిశిక్ష విధిస్తూ నేడు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.