(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: లోక్సభలో తనను ట్యూబ్లైట్ అంటూ అవహేళన చేసిన ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బదులిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన లోక్సభ వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రధానిలాగా ప్రవర్తించలేరని వ్యాఖ్యానించారు.
సాధారణంగా ప్రదానమంత్రికి ఒక హోదా ఉంటుంది. ప్రధానమంత్రి ఒక పద్ధతి ప్రకారం వ్యవహరిస్తారు. ప్రధానికి ఒక హుందాతనం ఉంటుంది. కానీ మన ప్రధానమంత్రికి ఇవేమీ లేవు. ఆయన అసలు ఒక ప్రధాని లాగే ప్రవర్తించరు. అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
గురువారం లోక్సభలో ప్రధాని ప్రసంగం సందర్భంగా రాహుల్ గాంధీ జోక్యం చేసుకున్నపుడు మోదీ ఈ ట్యూబ్లైట్ వ్యాఖ్యలు చేశారు. నేను 30 – 40 నిముషాలుగా మాట్లాడుతున్నాను. కరంటు ఇప్పటికి అందింది. ఏం చేస్తాం కొన్ని ట్యూబ్లైట్లు అలాగే ఉంటాయి అని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన మాటలకు బిజెపి సభ్యులు కేరింతలు కొట్టారు.
#WATCH Prime Minister Narendra Modi after Rahul Gandhi made an intervention in his speech in Lok Sabha: I was speaking for the last 30-40 minutes but it took this long for the current to reach there. Many tubelights are like this. pic.twitter.com/NwbQVBHWPx
— ANI (@ANI) February 6, 2020