అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మీ పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారు. పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి. వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగ కూడదు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ల కూడదని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు తండ్రీ కొడుకులు. దేవాన్ష్ను తెలుగు మీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం?’ అని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సవాలు విసిరారు.
మీ పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారు. పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి. వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగ కూడదు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ల కూడదని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు తండ్రీ కొడుకులు. దేవాన్ష్ ను తెలుగుమీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం?
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 8, 2019
అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన విషయంపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ… ‘పది వేల రూపాయల లోపు డిపాజిట్ చేసి మోస పోయిన 3.7 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ నిధులు పంపిణీ చేసి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట నిలుపుకున్నారు. మీకిది కనిపించట్లేదా చంద్రబాబు గారూ. కుక్కలను ఉసిగొల్పి మొరిగించే బదులు ఇలాంటి మంచి పనులను ప్రశంసిస్తే హుందాగా ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.
https://twitter.com/VSReddy_MP/status/1192650955960901632
టీడీపీ హయాంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తామంటే వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేశారని.. ఇప్పుడు మళ్లీ ఇంగ్లీష్ మీడియంను ఎందుకు తీసుకొచ్చారని ప్రతిపక్ష టీడీపీ ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వ విధానంపై నానా యాగీ చేశారని.. ఇప్పుడు జగన్ సర్కార్ చేస్తుంది ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటూ మాజీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.