విశాఖపట్నం: రాష్ట్ర రాజధాని భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు అవుతోందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. రాజధానికి అవసరమైన భూముల కోసం విశాఖలో సర్వే జరుగుతోందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న అలోచనలో సిఎం జగన్ ఉన్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బిమిలి నియోజకవర్గానికి పరిపాలనా రాజధాని రావడం వల్ల మహాపట్టణంగా విరాజిల్లనుందని ఆయన చెప్పారు. జిఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో మూడు రాజధానులపై విధివిధానాలపై కసరత్తు చేస్తున్నారని తెలిపారు.
అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతు నష్టపోరని చెప్పారు.కేవలం ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడిన బినామీలే నష్టపోతారని విజయసాయిరెడ్డి అన్నారు. వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే విశాఖలో రాజధానిని నెలకొల్పాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని ఆయన తెలిపారు.