అమరావతి: అమరావతి నుండి రాజధానిని తరలించడానికి వీలులేదంటూ రైతులు చేపట్టిన దీక్షలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. బుధవారం తుళ్లూరులో రైతులు, యువత వినూత్న రీతిలో నిరసనకు దిగారు. యువత రోడ్డుపై కారమ్స్, షటిల్, క్రికెట్, వాలీబాల్ ఆటలను ఆడుతూ తమ నిరసన తెలియజేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా మాస్క్లతో యువత ఆటలు ఆడారు. అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని యువత కోరింది. తాళ్లాయపాలం రైతులు కృష్ణానదిలో జలదీక్ష నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రైతులు ప్రసంగించారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతి ప్రాంతంలో పర్యటించి ఆందోళన చేస్తున్న రైతాంగానికి సంఘీభావం తెలుపనున్నారు.
previous post
next post