(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: రాజధాని, అభివృద్ధి ప్రణాళికపై బిసిజి గ్రూపు తయారు చేసిన నివేదికను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అందజేసింది. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో శుక్రవారం సిఎం జగన్తో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధానిపై ఇప్పటికే జిఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. ఈనెల ఆరవ తేదీన రెండు నివేదికలను హైపవర్ కమిటీ పరిశీలించనుంది. అలాగే ఈ నెల ఎనిమిదవ తేదీన రెండు నివేదికలపై కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే బిసిజి తమ మధ్యంతర నివేదకను అందజేసిన విషయం తెలిసిందే.