అమరావతి: ప్రస్తుతం ఏపిలో నెలకొన్న పరిస్థితులపై జనసేన నేత, ప్రముఖ సినీ నటుడు కొణిదెల నాగబాబు ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రైతాంగం, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ట్విట్టర్ వేదికగా నాగబాబు చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారంటూ నాగబాబు విమర్శించారు. నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారో తెలియదు కానీ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అమరావతి రాజధాని గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో సిఎం జగన్, టిడిపి అధినేత చంద్రబాబుపై ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నాగబాబు చేసిన ట్వీట్కు గంటల వ్యవధిలోనే వందలాది మంది లైక్లు ఇచ్చారు.
Between two real estate business men ap people are suffering.
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 5, 2020