(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరిశిక్ష అమలుపై పటియాలా కోర్టు స్టే విధించింది.
దోషులు నలుగురికి రేపు (ఫిబ్రవరి ఒకటి) ఉదయం ఆరు గంటలకు ఉరి శిక్ష అమలు చేయనున్న తరుణంలో ఒక్క రోజు ముందు శుక్రవారం శిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దోషులు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తదుపరి ఉత్తర్వులు వెలవడే వరకూ ఉరిశిక్ష అమలు చేయవద్దని ఆదేశించింది.
నలుగురు దోషుల్లో ఒకరి క్షమాభిక్ష పిటీషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నందున కోర్టు ఉరిశిక్షను వాయిదా వేసింది.
మరో పక్క ఘటన జరిగిన సమయంలో తాను మైనర్ నంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా వేసిన రివ్యూ పిటిషన్ను శుక్రవారం సుప్రీం కోర్టు కొట్టివేసింది.
దోషులను ఉరి తీసేందుకు తీహాడ్ జైలులో ముమ్మర ఏర్పాట్లు జరిగాయి. జైలుకు చేరుకున్న తలారీ పవన్ జల్లాద్ నేడు ఉరికి ట్రయిల్ కూడా నిర్వహించారు.
దోషులు నలుగురికి ఫిబ్రవరి 1వ తేదీన ఉరి శిక్ష అమలు చేయాలని ట్రయిల్ కోర్టు డేత్ వారెంట్ ఇచ్చిన విషయం విదితమే.