అమరావతి :టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేడు తెనాలితో పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మంగళగిరి నుండి గుంటూరు, నారాకోడూరు, సంగంజాగర్లమూడి, అంగలకుదురు, చెంచుపేట, మారిస్ పేట మీదుగా చంద్రబాబు చేరుకుని మున్సిపల్ మార్కెట్ వద్ద దీక్షా శిబిరం స్థలాన్ని పరిశీలిస్తారు. వీఎస్ ఆర్ అండ్ ఎన్ వి ఆర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. సభలో జేఏసీ రాష్ట్ర నాయకులు పాల్గొంటారనీ, టీడీపీ ఎమ్మెల్సీలకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలపాటి రాజా తెలిపారు.
తెనాలిలో వారం రోజుల క్రితం చంద్రబాబు పర్యటన ఖరారు కాగా నాడు దీక్ష శిబిరం దగ్ధం, వైసీపీ, టీడీపి శ్రేణుల ఘర్షణల నేపథ్యం 144 సెక్షన్ అమలులో ఉందని, సభలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీస్ శాఖ తెలియజేయడంతో పర్యటన వాయిదా వేసుకున్నారు.