అమరావతి : దేశం లోని ఎ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం ఏమైందని ఆయన ప్రశ్నించారు. మీరు, మీ 22 మంది ఎంపీలు ప్రత్యేక హోదాను ఎప్పుడు సాధిస్తారో అని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారని నాని అన్నారు.
శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులు, మహిళల మీద ప్రతాపం చూపించడం కాదు… కేంద్రం మీద మీ ప్రతాపం చూపించి ప్రత్యేక హోదాను సాధిస్తే మంచిదని ఆయన వ్యాఖ్యనించారు.
ఏపీకి ప్రత్యేక హోదా లేదు అంటూ లోక్ సభలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన సమాధానానికి సంబంధించిన పత్రికా కథనాన్ని అయన షేర్ చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?