అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, మహిళలు నిర్వహిస్తున్న అందోళనలు 49వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 49వ రోజు రిలే దీక్షలు జరుగుతున్నాయి.
ఉద్దండరాయునిపాలెం.ఎర్రబాలెం తదితర రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు కూడా రైతుల 24 గంటల దీక్షలు కొనసాగనున్నాయి. తుళ్ళూరులో 48 గంటల దీక్షలు చేపట్టారు.
మందడం, వెలగపూడిలోను 24 గంటల దీక్షకు రైతులు కూర్చున్నారు.