హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో విచారణ వాయివా పడింది. గురువారం మధ్యాహ్నం కేసును విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది.
చటాన్ పల్లి వద్ద డిసెంబర్ 6న దిశ కేసు నిందితులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులను ఎన్ కౌంటర్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మృతదేహాలను ఈ నెల 13వ తేదీ వరకు గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని ఈ నెల 9న హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.