అమరావతి: సిఎం జగన్ అన్నట్లు పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా జి ఎన్ రావు కమిటీ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడంతో అమరావతి ప్రాంతంలోని రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్వక్తం చేస్తున్నారు. ఇది దున్నపోతు పాలనలా ఉందని విమర్శిస్తూ దున్నపోతుకు పాలు తీసినట్లు విన్నూత్న రీతిలో నిరసన వ్వక్తం చేశారు.
మరో పక్క రాజధాని ప్రాంత గ్రామాలలో ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు. మందడంలో స్పీడ్ యాక్సిస్ రోడ్డు పై సిమెంట్ బల్లలు, విద్యుత్ స్తంబాలు అడ్డంగా వేసి తమ గ్రామం లోకి వాహనాలు రాకుండా అడ్డుకున్నారు. రోడ్డుపై బైటాయించి నిరసన కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.