(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
విజయవాడ: బిజెపి నేతలతో చర్చించాల్సిన అంశాలపై పార్టీ నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. విజయవాడలోని ఫార్చ్యూన్ మురళీ హోటల్ నందు పార్టీ నేత నాదెండ్ల మనోహర్తో కలిసి ముఖ్యనేతలతో పవన్ భేటీ అయ్యారు. మరి కొద్దిసేపటిలో బిజెపి, జనసేన కీలక సమావేశం జరగనుంది. బిజెపి తరపున రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దియోధర్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు హజరుకానున్నారు. రాజధానిపై బిజెపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ, ప్రజా సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.