న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి అయిన వినయ్ శర్మ(26) క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పెట్టుకున్న పిటిషన్ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శనివారం తిరస్కరించారు
నిర్భయ దోషులు నలుగురికి శనివారం ఉరిశిక్ష అమలు చేయాలనీ ట్రయిల్ కోర్టు డెత్ వారంట్ జారీ చేయగా, వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న నేపథ్యంలో వారి ఉరి వాయిదా పడిన విషయం తెలిసిందే.
నియమావళి ప్రకారం.. ఒక కేసులో ఒకరి కంటే ఎక్కువ మంది దోషులు ఉన్నపుడు అందరినీ ఒకేసారి ఉరితీయాలి. ఈ కారణంగా శుక్రవారం కోర్ట్ వీరి ఉరి శిక్షను వాయిదా వేసింది.