(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: రాజధాని తరలింపునకు కేంద్రం ఆమోదం తెలిపిందా అన్న అనుమానం కలుగుతోందని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి, జనసేన కలయిక కీలక పరిణామమని అన్నారు. రాజధాని అంశంపై బిజెపి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపిన కేంద్రానికి అమరావతి చిన్న విషయమేనని ఆయన అన్నారు.
అమరావతి కోసం బిజెపి, జనసేన కలిసి ఏమి చేయనున్నారో అని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు. కొత్త పొత్తుల శక్తి ఏమిటో భవిష్యత్తులో తేలుస్తుందని పయ్యావుల అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?