అమరావతి: ఏపీ అసెంబ్లీలో ‘ఏపీ దిశ యాక్ట్’ చట్ట సవరణపై చర్చ జరుగుతున్న వేళ అరుదైన ఘటన జరిగింది. స్పీకర్ కుర్చీలోకి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వచ్చి కూర్చున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లగా, ఆ సమయంలో ఉప సభాపతి కోన రఘుపతి కూడా అందుబాటులో లేరు. దీంతో సభను నడిపించే బాధ్యతలను స్పీకర్ తన స్థానంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటిని తాత్కాలికంగా నియమించారు. సభలో హోంమంత్రి సుచరిత మహిళా రక్షణ కోసం దిశ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆయనే సభను నడిపించారు.
కాగా, స్పీకర్ తన విచక్షణ అధికారాల ప్రకారం తాను అందుబాటులో లేనప్పుడు సభలోని ఏదేని ఒక సభ్యుడికి సభను నడిపించే బాధ్యతను అప్పగించ వచ్చు. సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేని వేళ, సభ్యుల్లో ఒకరు తాత్కాలిక స్పీకర్ బాధ్యతలు తీసుకుని సభను కొనసాగిస్తారు.
https://youtu.be/s36aN9p8HdQ