అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానితో విజయవాడలో, రాజధాని అమరావతి ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సుయాత్రను పోలీసులు అడ్డుకొన్నారు. బస్సు యాత్రకు ముందు బెంజ్ సర్కిల్ వద్ద ఒక ఫంక్షన్ హాలులో జెఎసి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు బయటకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను పోలీసు వాన్ ఎక్కించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంచెం సేపు తర్వాత పోలీసులు ఆయనను అక్కడి నుంచి తరలించారు.చంద్రబాబు తో సహా నారా లోకేష్, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, రామానాయుడు, పంచుమర్తి అనురాధ, సిపిఐ నేత రామకృష్ణను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు.
previous post
next post