NewsOrbit
టాప్ స్టోరీస్

కర్నూలులో భూములెందుకు?రాజధాని కోసమేనా!?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలుకు మార్చాలని వైసిపి ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిందా? అందుకే రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం అనువైంది కాదనే ప్రచారాన్ని తీసుకువచ్చిందా? ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా ప్రభుత్వ చర్యలు కనబడుతున్నాయి. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అనే అభిప్రాయ సేకరణకు మాజీ ఐఎఎస్ అధికారి జిఎన్ రావు నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ కమిటీ ఆదివారం కర్నూలు వెళ్లినపుడు, కర్నూలు జిల్లా కేంద్రానికి 15 నుండి 20 కిలో మీటర్ల దూరంలో విమానాశ్రయానికి సమీపంలో ప్రభుత్వ భూములను గుర్తించాలని అక్కడి జిల్లా అధికారులకు సూచించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.

వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మంత్రి  బొత్సా సత్యనారాయణ రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. రాజధాని ఏర్పాటుకు అమరావతిలో భూములు పనికి రావని, గత ప్రభుత్వం రాజధాని భూసేకరణలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపణలు కూడా చేశారు. దీనిపై విచారణ కూడా జరుపుతున్నామనీ, నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటూ చెప్పుకొచ్చారు. రాజధాని తరలిస్తారని వస్తున్న వార్తలపై అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతాంగం ఆందోళనలు వ్యక్తం చేయడంతో ప్రధాన ప్రతిపక్షం టిడిపితో పాటు బిజెపి, జనసేన, వామపక్షాల నేతలు ఆ ప్రాంతంలో పర్యటించి రైతులు ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ప్రజలు, ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున దీనిపై విమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాత్రం ఇప్పటి వరకూ రాజధానిపై ఎటువంటి ప్రకటన చేయలేదు.అభివృద్ధి వికేంద్రీకరణకు వైసిపి ప్రభుత్వం మొగ్గుచూపుతుందంటూ మంత్రులు వెల్లడిస్తూ వచ్చారు.

రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న జిఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రతినిధులు ఆదివారం కర్నూలు కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ భూములు గుర్తించి సిద్ధంగా ఉంచుకోవాలని నిపుణుల కమిటీ అధికారులకు సూచించింది. ఈ సందర్భంలో కర్నూలు అభివృద్ధికి తగినన్ని నిధులు ఇప్పించాలని నిపుణుల కమిటీని కలెక్టర్ జి వీరపాండియన్ కోరారు. ఓర్వుకల్లు విమానాశ్రయం పనులు 85 శాతం పూర్తయ్యాయని, మరో 15 శాతం పనులు చేసేందుకు నిధులు కేటాయించాలని ఆయన కోరారు. జిల్లాకు వివిధ నగరాల నుండి రోడ్డు, రైలు, విమానయాన అనుసంధానాన్ని పెంచాలనీ కోరారు. మెడిటెక్ సిటీ ప్రాజెక్టు మంజూరుతో పాటు జిల్లాలో హైకోర్టు, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కమిటీ కన్వీనర్ దృష్టికి తీసుకువచ్చారు.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment