అమరావతి: మూడు రాజధానులపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఉదయం సీఎం జగన్ తో భేటీ అయ్యారు. న్యాయ, రాజ్యాంగ అంశాలపై చర్చించారు.
రాజధానిని అమరావతిలో కొనసాగించాలంటూ ఆప్రాంత రైతులు, ప్రభుత్వం తెస్తున్న అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులపై దాఖలైన పిటిషన్లను గురువారం ప్రత్యేక బెంచ్ విచారించనుంది. ఈ పిటిషన్లపై విచారించేందుకు ఏపీ హైకోర్టు… ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసింది. ఈ బెంచ్లో జరిగే విచారణకు ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదించబోతున్నారు.
నిజానికి ఈ పిటిషన్లపై బుధవారమే విచారణ జరపాల్సి ఉన్నా… నిన్న మండలిలో ఈ రెండు బిల్లులపై చర్చ జరుగుతుండటంతో విచారణను చేపట్టలేదు. మూడు రాజధానులపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? బిల్లులపై ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తుందా ? లేక రైతులు, పిటిషనర్ల వాదనతో ఏకీభవిస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది.