(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో పవన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన – బిజెపి ఉమ్మడి కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు. సమావేశంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్, బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు, పార్టీ ఇన్చార్జి సునీల్ ధియోధర్, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురందీశ్వరిలు తదితరులు పాల్గొన్నారు. నడ్డాతో పవన్ భేటీ కావడం ఇది రెండో సారి. రాష్ట్రంలో బిజెపితో పొత్తుకు ముందు నడ్డాతో భేటీ అయ్యారు. నేటి భేటీ అనంతరం ఇరుపార్టీలు కోఆర్డినేషన్ కమిటీ సభ్యులను ప్రకటించనున్నాయి.