(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్రధాని మోదీని ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు తన కుటుంబసభ్యులతో కలవడంపై చర్చ జరుగుతున్న వేళ.. మోహన్ బాబు, ఆయన కొడుకు విష్ణులు ఆసక్తికర ట్వీట్ల చేశారు. ‘వాట్ ఏ మ్యాన్! నరేంద్రమోదీ’ అంటూ ప్రధాని మోదీని ప్రశంసిస్తూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. మోదీతో తాను కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. అలాగే, మంచు విష్ణు కూడా ఓ పోస్ట్ చేశారు. మోదీతో భేటీ బాగా జరిగిందని, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని పేర్కొంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు ప్రధానితో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు.
What a man! @narendramodi pic.twitter.com/ghOwzzGAYI
— Mohan Babu M (@themohanbabu) January 6, 2020
కాగా, సోమవారం(జనవరి 6) మోహన్ బాబు కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే. దాదాపు అరగంటపాటు మోదీతో భేటీ అయిన మంచు ఫ్యామిలీ పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ… మోహన్బాబు కుటుంబాన్ని బీజేపీలోకి ఆహ్వానించారు. అయితే, దీనిపై వెంటనే సరే అని చెప్పకపోయినా… మోహన్బాబు నవ్వుతూ మోదీ ప్రతిపాదనను స్వాగతించినట్లు సమాచారం. మోహన్ బాబుతో పాటు కొడుకు విష్ణు, కోడలు వెరోనికా, కూతురు లక్ష్మీ ప్రసన్న ప్రధానిని కలిశారు. మోహన్బాబు ప్రధాని మోదీని కలవడం చర్చనీయాంశమైంది. బీజేపీలో చేరాలని మోహన్ బాబుకు ఆహ్వానం అందిన నేపథ్యంలోనే మోదీని కలిసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
What a meeting!. My Prime Minister! Had the honor of gifting a painting of Lord Vishnu DasaAvatar. And got his autograph on another one. Lot to learn and wishing him more power and energy. pic.twitter.com/g5X7SGZ38h
— Vishnu Manchu (@iVishnuManchu) January 6, 2020